సెక్యులరిజం ముసుగులో హిందుత్వానికి సంబంధించిన ప్రతి అంశాన్ని వివాదాస్పదం
చేస్తున్నారు. ఏది మతం? ఏది
ఈ దేశ జీవన విధానం?
ఏది ఆధ్యాత్మికం? ఏ పండుగ జాతీయ
పండుగ? ఏది మతపరమైన పండుగ?
మన పురాణాలు చారిత్రక గ్రంథాలా లేక మతపరమైనవా? అనే
పనికిరాని ప్రశ్నలు వేస్తుంటారు అతి తెలివైన మన
మేధావులు.
ఈ మధ్య సుప్రీంకోర్టులో 'యోగ'
అనేది మతం. దానిని అన్ని
పాఠశాలలలో నేర్పించటం సెక్యులరిజానికి వ్యతిరేకమని ఒక కేసు వేయబడింది.
సుప్రీంకోర్టు దీని విషయం తేల్చాలి.

ఈ యోగ అంశము అమెరికాలో
కాలిఫోర్నియా రాష్ట్రంలో సమస్య చేయబడింది. ఆ
సమస్య ఇంకా పూర్తి స్థాయిలో
పరిష్కారం కాలేదు. ఇది మనం సృష్టించుకున్న
సెక్యులరిజం మనకు ఇస్తున్న కానుకలు.
యోగ అనేది మంచి వ్యక్తులను
నిర్మాణం చేసే ప్రక్రియలో ఒక
భాగం. యోగ ద్వారా శరీరాన్ని,
ప్రాణాయామం ద్వారా మనస్సును, ధ్యానం ద్వారా అంతర్ముఖులం కావటం నేర్పిస్తారు. దీనిని
మతపరమైనదిగా భావించి వివాదాస్పదం చేయటాన్ని మన పాలకులు, మన
సెక్యులర్ మేధావులు, మన కోర్టులు ఎందుకు
ప్రశ్నించలేకపోతున్నాయి?
ఈ పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో ప్రతిదానికి మనం జవాబు చెప్పుకోవలసిన
అవసరం లేకుండా సుప్రీంకోర్టు సరియైన నిర్ణయం ప్రకటిస్తుందని ఆశిద్దాం.
- వాషింగ్టన్ పోస్ట్ పత్రిక, లోకహితం.. ఆధారంగా...
No comments:
Post a Comment